3 May 2020

అభినందలతో . . .



విజయనగరం జిల్లా నుండి 200 లకు పైగా సభ్యులు విశేషం గా  ఆన్-లైన్ లో ₹ 2లక్షలకు పైగా  డొనేషన్లు పంపారని తెలియచేయుటకు  సంతోషిస్తున్నాము. 
మన కేంద్ర సంఘం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి రక్షణ కై  తోడ్పాటు గా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వా ల సహాయనిథి కి విరాళాలివ్వాలని గత నెలలొ పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఈసందర్భంగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ₹ 69 లక్షలకు పైగా అన్ని సర్కిల్లనుండి  మన అసోసియేషన్  సభ్యులు పంపించటం జరిగింది.  మన ఆంధ్ర సర్కిల్ సభ్యులు కూడా ఇప్పటికే ₹ 8 లక్షలు పంపారు. లాక్ డౌన్ పరిమితులు కారణంగా ఇంకా పూర్తి స్థాయిలో జరుగలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ సడలింపులు ఈ నెలాఖరులోగా పెద్దగా ఉండక పోవచ్చు.
ఇదంతా భారత్ లో కొనసాగుతున్న సంపూర్ణ లాక్ డౌన్ నేపధ్యంలో జరుగుతున్న కార్యక్రమం.
ఎక్కువ సంఖ్యలో ఇతోధికంగా స్పందించిన విజయనగరం జిల్లా సభ్యులకు , అందుకోసం విశేషం గా క్రృషి చేసిన జిల్లా నాయకులకు సర్కిల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియచేస్తోంది.
అదేవిధంగా రాష్టవ్యాపితంగా ఇప్పటి వరకు విరాళాలు పంపినటు వంటి సభ్యులందరికీ, జిల్లాల్లో అందుకోసం పనిచేసిన మన నాయకులందరికీ సర్కిల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియచేస్తోంది.
అందుబాటులో ఉన్న మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శు లందరినీ మరొక సారి కోరుతూ ....
అవసరమైన నిబంధనలను ఆచరిస్తూ, తద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ  ....
03-05-2020                                                                    సర్కిల్ కార్యదర్శి.