15 Jul 2020



ప్రియమైన DS లు / BS లకు
COVID-19 నిధికి మన ఆంధ్ర సర్కిల్ సభ్యులు యిప్పటివరకు 12 లక్షలకుపైగా విరాళాలు పంపించాం.
ఆలిండియాలో ఇదే సమయానికి 96 లక్షలకు పైగా విరాళాలు పంపించడం జరిగింది.
ఇంత కష్టసమయంలోకూడా CHQ అప్పీలుకులభించిన యీస్పందన అపూర్వం.ఈ మొత్తంలో ఎక్కువ భాగం స్వచ్ఛందంగా ఆన్ లైన్‌లో పంపబడింది.
ఒక కోటిఈ మైలురాయిని చేరుకోవటమనే చరిత్రను సృష్టించడానికి మనం కేవలం నాలుగు లక్షల దూరంలో ఉన్నాము, బహుశా మరేయితర అసోసియేషన్ యింత ఘనంగా చేసి ఉండేది కాదు.
యీ గొప్ప కారణానికి విరాళం ఇంకా ఇవ్వవలసిన వారిని సంప్రదించమని జిల్లా,బ్రాంచి కార్యదర్సులందరినీ అభ్యర్థిస్తున్నాను.
విజయనగరం,గుంటూరు ,పశ్చిమ గోదావరి జిల్లాలనుండి స్పందన బాగా ఉందన్న విషయం మనం చూస్తూనే వున్నాం. అయితే మిగతా చోట్ల ఆవిధంగా లేదు. మరొకసారి ప్రయత్నిస్తే మంచి ఫలితముంటుందని ఆశిస్తున్నాం.
మనకి మనం పెట్టుకున్న గడువు మరో 15 రోజులలో ముగియనుంది.
ఎప్పటికీ గుర్తుండిపోయేఆ -  కోటిని చేరుకోటానికి  మన సర్కిల్ సభ్యులందరూ సహకరించగలరని  ఆశిస్తున్నాము.
వి.వర ప్రసాద్  సి.ఎస్